రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో అధికారులు తొమ్మిది రైళ్లను పూర్తిగా, రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు ఒకే ట్రాక్ పై కొనసాగుతున్నాయి. ఈ మేరకు రైళ్ల రద్దు వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్ఓ నుశ్రత్ ఎం మండ్రుప్ కర్ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ – లింగంపల్లి రైలు రెండు గంటల ఆలస్యంగా నడవనుంది. విజయవాడ – రాజమండ్రి, కాకినాడ పోర్టు – విజయవాడ రైళ్లు పాక్షికంగా రద్దు అయ్యాయి.
Earthquake: నేపాల్ లో భారీ భూకంపం ..భవనాలు కూలి ఆరుగురు మృతి..భారత్ లోనూ ప్రభావం
పూర్తి గా రద్దు చేసిన రైళ్లలో .. విజయవాడ – విశాఖపట్నం (12718). విశాఖ – విజయవాడ (12717), గుంటూరు – విశాఖ (17239), విశాఖ – గుంటూరు (17240) , విశాఖ – విజయవాడ (22701), విజయవాడ – విజయవాడ (07628), గుంటూరు – విజయవాడ (07864), కాకినాడ పోర్టు – విజయవాడ (17257) రైళ్లు ఉన్నాయి.
Obulapuram Mining Case: ఒబులాపురం మైనింగ్ కేసులో ఐఎఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట