Omicron: ఏపిలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కనాడే అత్యధికంగా పది కేసులు నిర్ధారణ కావడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కి చేరాయి. నైజీరియా, సౌదీ, కువైట్, అమెరికా నుండి వచ్చిన వారిలో కొత్త వేరియంట్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాలో మూడు, అనంతపరం, కర్నూలు జిల్లాలో రెండు చొప్పున, పశ్చిమ గోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయినట్లు అధికారులు వివరించారు. అయితే బాధితులు అందరు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.
Omicron: ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఏపిలో 31,743 మందికి పరీక్షలు జరపగా 186 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో 1049 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో పక్క తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,023 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 235 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం 3,490 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ తెలియజేసింది.
ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి
దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది. దీనిపై కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ దేశ ప్రజలకు సూచనలు చేశారు. ప్రజలు అలసత్వం వహిస్తూ, నిబంధనలు పాటించకపోతే కోవిడ్ మహమ్మాదిని నియంత్రించలేమని అన్నారు. వైరస్ రూపు మార్చుకుని మరో సారి విజృంభిస్తోందని పేర్కొన్నారు. ఈ తరుణంలో దేశ ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి అమిత్ షా సూచించారు.