one crore cash seized : నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో వాహనాల తనిఖీలో భారీగా నగదు పట్టుబడింది. నెల్లూరు నుండి గుంటూరు జిల్లా నరసరావుపేట వెళుతున్న కారును కోవూరులో జాతీయ రహదారిపై సాయి బాబా ఆలయం వద్ద పోలీసులు సోదా చేయగా కోటి రూపాయల నగదు గుర్తించారు.
కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు నగదుకు సంబందించిన పత్రాలు చూపించలేదు. దీంతో పోలీసులు ఆ నగదును సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కారులో పెద్ద మొత్తంలో తరలిస్తున్న నగదు పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ నగదు స్థిరాస్థి క్రయ విక్రయాలకు సంబంధించినదా లేక హవాలా నగదా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.