29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గంజాయి కేసులో వైసీపీ రెబల్ నేత సుబ్బారావు.. బుక్ అయినట్లేనా..?

Share

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పై గతంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన వైసీపీ నేత సొమిశెట్టి సుబ్బారావు గుప్తాను ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేదిత గంజాయి కల్గి ఉన్నాడన్న అభియోగంపై ఒంగోలులోని మంగమ్మ కళాశాల వద్ద గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఒంగోలు తాలూకా  పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరుపుతున్నారు. సుబ్బారావు గుప్తా కొంత కాలంగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు.

subbarao gupta

 

గతంలో గుంటూరులోని ఒక లాడ్జీలో బాలినేని అనుచరులు సుబ్బారావు గుప్తాపై దాడి చేశారు. ఆ క్రమంలోనే సుబ్బారావు గుప్తా నివాసంపైనా దాడి చేశారు. అప్పటి నుండి సుబ్బారావు గుప్తా తాను వైసీపీ కార్యకర్తనేననీ, జగన్మోహనరెడ్డిని అభిమానినే అని పేర్కొంటూనే బాలినేని పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ సమయంలో సుబ్బారావు గుప్తా పలు మీడియాల్లో బాలినేనికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఆర్యవైశ్య సంఘం నేతలు సుబ్బారావు గుప్తాకు బాసటగా నిలవడం జరిగింది. ఆ ఘటనతో సుబ్బారావు గుప్తా పేరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రీసెంట్ గా మహిళా వసతి గృహంపై బాలినేని అనుచురుడు సుబానీ ముఠా దాడి చేసిందనీ, ఈ విషయంలో బాలినేని తీరును వ్యతిరేకిస్తూ సుబ్బారావు గుప్తా పరుష పదజాలంతో విమర్శలు చేశారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల్లోనే గంజాయి కల్గి ఉన్నాడన్న అభియోగంపై ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు .. తమ పీఠంపై రాజకీయ ముద్ర వేయాలని చూశారంటూ..


Share

Related posts

YS Bharati: ఏపీ సీఎం పీఠంపై వైఎస్ భార‌తి?

sridhar

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ట్రోఫీ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శ్వేత..!!

sekhar

IPS ABV: ఏపి ప్రభుత్వ సంజాయిషీ నోటీసుపై ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు స్పందన ఇదీ

somaraju sharma