Pan Aadhaar link: ఇది పాన్ కార్డు ఉన్న వారికి ఊరట నిచ్చే అంశం. ఓ విధంగా చెప్పాలంటే పాన్ కార్డుదారులకు ఇది శుభవార్తే. వాస్తవానికి ఈ నెలాఖరులోగా పాన్ కార్డు ఉన్న వారందరూ ఆధార్ లింగ్ చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో చాలా మంది పాన్ ఆధార్ లింక్ చేసుకోలేకపోయారు. దీనిపై కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని గతంలోనే కేంద్రం తెలియజేసింది. పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ జరగనందు వల్ల పాన్, ఆధార్ లింక్ చేసుకోవడానికి గడువును మరో మూడు నెలలు పొడిగించింది. దీంతో పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి మరింత గడువు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ వర్గాలు కంగారు లేకుండా నెమ్మదిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే వెసులుబాటు వచ్చింది.
Read More: Revanth Reddy: బిగ్ బ్రేకింగ్..టీపీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించిన ఏఐసీసీ
వాస్తవానికి ఈ గడువు జూన్ 30 వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే పాన్ ఆధార్ లింక్ గడువును కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది. పాన్ కార్డులు కల్గిన ప్రతి ఒక్కరూ సెక్షన్ 139 ఏ ఏ ప్రకారం వారి ఆధార్ కార్డు తో ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు గడువు ఇచ్చినందున పాన్ ఆదార్ లింక్ చేసుకోని వారు త్వరగా ఆధార్ తో పాన్ లింక్ చేసుకోవడం మంచింది. పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోకపోతే భవిష్యత్తులో వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది.
Read More: AP CS Adityanath das: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం పొడిగించిన కేంద్రం