ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. ఎన్నికలకు ప్రభుత్వం సోమవారం వరకూ సిద్ధం కాని నేపథ్యంలో గతంలో విడుదల చేసిన షెడ్యూల్ లో ఎస్ఈసీ మార్పులు చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండవ దశను మొదటి దశగా, మూడవ దశను రెండవ దశగా, నాల్గవ దశను మూడో దశగా, మొదటి దశను నాల్గవ దశగా మార్పు చేసింది.
గత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5.9,13,17 తేదీలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే మార్చిన రీషెడ్యూల్ ప్రకారం 9,13,17,21 తేదీలలో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ పేర్కొంది. మొదటి దశ ఎన్నికలకు ఈ నెల 29వ తేదీ నుండి నామినేషన్ లు స్వీకరించనున్నట్లు తెలిపింది.