Panchayat polls : గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ దశ ఫలితాలలోనూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ycp హవా కొనసాగింది. అయితే పలువురు కీలక నేతల నియోజకవర్గాల్లోని ప్రజా ప్రతినిదులకు అక్కడి ఓటర్లు షాక్ లు ఇచ్చారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో అక్కడి ఓటర్లు ఆయనకు షాక్ ఇచ్చారు. వరుసగా మూడు సార్లు (తొలి సారి టీడీపీ, తరువాత వైసీపీ) ఈ నియోజకవర్గం నుండి గెలిచి హాట్రిక్ రికార్డు సాదించిన మంత్రి కొడాలి నాని వైసీపీలో ఏ మంత్రి కూడా టీడీపీని, చంద్రబాబును, లోకేష్ ను విమర్శించని విధంగా తన దైన శైలిలో విమర్శిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలూ తీవ్ర స్థాయిలో చేస్తూ వచ్చిన కొడాలి నాని స్వగ్రామంలో టీడీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కొల్లూరి అనూష సుమారు 350 ఓట్ల మెజార్టీతో గెలవడంతో పాటు 12 వార్డుల్లో 11 వార్డులు టీడీపీ మద్దుతు దారులు కైవశం చేసుకోవడం టీడీపీ వర్గీయుల్లో ఆనందాన్ని నింపింది.
టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో వైసీపీ షాక్ ఇచ్చింది. అనంతరం జిల్లాలో హిందూపురం నుండి బాలకృష్ణ, ఉరవకొండ నియోజకవర్గం నుండి పయ్యావుల కేశవ్ టీడీపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఈ రెండు నియోజకవర్గాలతో పాటు జిల్లా మొత్తం వైసీపీ మద్దతుదారులు అత్యదిక స్థానాల్లో విజయం సాధించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో మాత్రం వైసీపీ కంటే టీడీపీ మద్దతు దారులు అధిక స్థానాలు కైవసం చేసుకోగా మిగిలిన జిల్లాలో వైసీపీ హవా కొనసాగింది. టీడీపీ కీలక నేతల నియోజకవర్గాల్లో వైసీపీ, వైసీపీ కీలక నేతల నియోజకవర్గాల్లో టీడీపీ బలవర్చిన అభ్యర్థులు విజయం సాధించడం ఆ ప్రాంతంలో వారికి మింగుడు పడని పరిస్థితి ఎదురైంది.
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల రెండవ విడతలో భాగంగా శనివారం 2,786 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ లకు 20,817 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. మొదటి దశలో మాదిరిగానే రెండవ దశలోనూ ఓటర్లు ఓటువేసేందుకు పోటెత్తారు. మొత్తం 81.67శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?