త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నిక విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే మొదటి నుండి తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో.. జనసేన, బిజెపి రెండు పార్టీలు.. ఎవరికివారు తమ పార్టీకి చెందిన అభ్యర్థి నిలబెట్టుకోవాలని అనేక వ్యూహాలు వేశాయి. ఈ క్రమంలో ఏపీ బీజేపీ పార్టీ నేతలు సమస్య లేదు తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి బిజెపి పార్టీకి చెందిన వ్యక్తిని ఉంటాడని స్పష్టం చేయడం జరిగింది.
అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన చేపట్టిన బీజేపీ పార్టీ కీలక నేతలతో కలిసిన తర్వాత.. ఉమ్మడి అభ్యర్థి అనే సరికొత్త నినాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల సోము వీర్రాజు తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరిని నిలబెట్టాలి అన్నదానిపై పవన్ కళ్యాణ్తో హైదరాబాదులో బేటీ అవ్వటం జరిగింది. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అనంతరం మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రెండు పార్టీలు కలిసి పని చేయడానికి తిరుపతి ఉప ఎన్నిక పునాది కానున్నట్లు స్పష్టం చేశారు. పరిస్థితి ఇలా ఉండగా తిరుపతి ఉప ఎన్నికల్లో కచ్చితంగా జనసేన పార్టీకి చెందిన వ్యక్తినే నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ బీజేపీని డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. లేకపోతే ఎన్నికల ప్రచారానికి తాను వచ్చే ప్రసక్తే లేదు అనే తరహా లో ఏపీ బిజెపి నేతలకు పవన్ అల్టిమేటం జారీ చేసినట్లు దీంతో .. తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ నేతలే కాకుండా జనసేన పార్టీ నేతలే పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.