Pawan Kalyan: ఏపిలో అప్పుల బాధతో అనేక మంది కౌలు రైతులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఒక్క గోదావరి జిల్లాలోనే 80 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిచి వేసింది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉగాది పండుగ నాడు వారికి ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. అప్పుల బాధతో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సాగును నమ్ముకున్న వారి పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల బాధల గురించి తెలుసుకొంటుంటే హృదయం ద్రవిస్తుందన్నారు.. కౌలు రైతుకు నిబంధనల పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందటంలేదన్నారు. సాగు చేసుకొంటే రుణం ఇవ్వరు.పంట నష్టపోతే పరిహారం ఇవ్వరని అన్నారు.
Pawan Kalyan: ఉగాది పూట ఆ కుటుంబాలు బాధతో ఉండకూడదనే
ఆత్మహత్య చేసుకున్నవారికీ ఆర్థిక సాయం అందించడంలేదని పేర్కొన్నారు. కనీసం అధికారులు కూడా పరామర్శించి విచారించరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఒక్కో బాధిత కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయల వంతున జనసేన ఆర్ధిక సాయం అందిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉగాది పూట ఆ కుటుంబాలు బాధతో ఉండకూడదనే వారికి కొంతైనా ఊరటను ఇచ్చేలా జనసేన పక్షాన ఆర్ధిక సాయం అందిస్తున్న పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ప్రతి కుటుంబాన్ని త్వరలోనే పరామర్శిస్తానని తెలిపారు. ఆర్ధిక సాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో కలిసి పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పండితులు పంచాగ శ్రవణం చేసి ఆశీర్వచనాలు అందించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?