Pawan Kalyan : ఏపి నూతన ఎస్ఈసీ sec గా గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి నీలం సాహ్ని Neelam sahni అదే రోజు సాయంత్రం పరిషత్ ఎన్నికల local body elections కు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎంపీటీసీ, MPTC జడ్పీటీసీ ZPTC ఎన్నికలకు ఈ నెల 8వ తేదీన పోలింగ్, 10 వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలతో నేడు ఎస్ఈసీ SEC సమావేశం నిర్వహించింది. ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన జనసేన Janasena అధినేత పవన్ కల్యాణ్ Pawan kalyan ..ఎస్ఈసీ Sec పై సీరియస్ కామెంట్స్ చేశారు.
ఎంపిటీసీ, జడ్పిటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇది ఎస్ఈసీ ఏకపక్ష నిర్ణయంగా పవన్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం అంటూ ఆహ్వానం పంపి రాత్రి అయ్యే సరికి ఎన్నికలకు పాత నోటిఫికేషన్ ప్రకారం కొనసాగిస్తామంటూ నోటిఫికేషన్ విడుదల చేయడం అప్రజాస్వామిక చర్యగా భావించాల్సి వస్తోందన్నారు. పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఫ్రెష్ నోటిఫికేషన్ విడుదల చేయాలని జనసేన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు తీర్పు రాకమునుపే ఎస్ఈసీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమైన నిర్ణయమని అన్నారు. ఎస్ఈసీ తొందరపాటు నిర్ణయం అధికార పార్టీకి లబ్దిచేకూర్చడానికేనని జనసేన భావిస్తున్నదని పవన్ కల్యాణ్ విమర్శించారు.