Pawan Kalyan: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఓ పని సరిగ్గా జనసేన పార్టీ రథసారథి పవన్ కళ్యాణ్ చర్య అదే రీతిలో ఉందని నెట్టింట ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. 2019లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 53 మందితో నరేంద్ర మోడీ కేబినెట్ ఏర్పాటైంది. ఆ తర్వాత విస్తరణ జరగలేదు. కేంద్ర కేబినెట్ లో గరిష్టంగా 81 మందిని మంత్రులుగా నియమించుకునేందుకు అవకాశం ఉండటంతో పాటుగా వివిధ సమీకరణాలను లెక్కలోకి తీసుకొని ప్రధానమంత్రి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. అయితే, సరిగ్గా అదే రోజు, జనసేన పార్టీ కొత్త కార్యవర్గాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీనిపైనే కొత్త చర్చ జరుగుతోంది.
Read More: Modi: అటు గవర్నర్లు…ఇటు మంత్రులు. .మోడీ లెక్క ఏంటో తెలుసా?
మోడీ క్యాబినెట్ ప్రత్యేకత ఇదే..
మోడీ క్యాబినెట్లో ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2024 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నట్లు అంటున్నారు. తాజా విస్తరణతో దేశ చరిత్రలోనే తొలి ‘యంగెస్ట్ కేబినెట్’గా నిలవనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కేంద్ర మంత్రుల సగటు వయసు చాలా తక్కువగా ఉంటుందని చెప్పాయి. మహిళా మంత్రుల సంఖ్య పెరుగుతుందని, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పిస్తారని వెల్లడించాయి.
Read More: Modi: మోడీ బ్యాడ్ టైం కాకపోతే.. ఇలా నవ్వుల పాలు అవడం ఏంటి!
పవన్ నిర్ణయం ఇదే…
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కొత్త కార్యవర్గం వివరాలను పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కమిటీల్లో 80 శాతం యువతకు అవకాశం కల్పించినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ నాయకులతోపాటు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను నియమించారు. రాష్ట్ర కార్యవర్గంలోకి చల్లా మధుసూధన్రెడ్డి, విజయ్ కుమార్, సయ్యద్ ముకరంచంద్ లను తీసుకున్నారు. లీగల్ సెల్కి ప్రతాప్, డాక్టర్ సెల్కి రఘు, ఐటీ సెల్కి శివరాంలను నియమించారు. చేనేత సెల్కి సుభాష్, పార్టీ కార్యక్రమాల రాష్ట్ర కో-ఆర్డినేటర్గా కల్యాణపు శ్రీనివాస్లను నియమిస్తూ జనసేనాని ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలోని జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లోకి తీసుకున్న వారికి నియామక పత్రాలను సమావేశంలోనే అందజేసి పార్టీ నేతలకు పరిచయం చేశారు.