ఏపీలో ఇప్పుడు అన్ని పార్టీల చూపు తిరుపతి ఉప ఎన్నికపైనే పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ మృతి చెందడంతో తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ఇంకా విడుదల కానప్పటికీ ఇప్పటికే అధికార వైసీపీ తమ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చింది. ప్రతిపక్ష తెలుగుదేశం అదే దారిలో నడిచి తమ నేతను ప్రకటించాయి. అయితే, మిగతా పార్టీల అభ్యర్థులు తేలాల్సి ఉంది. జనసేన, బీజేపీ కలిసి ఒకే అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు రెడీ అయ్యాయి. అయితే ఈ విషయంలో ఇంకా ట్విస్టులు కొనసాగుతున్నాయి.
మైండ్ బ్లాంక్ చేస్తున్న బీజేపీ
తిరుపతి ఉప ఎన్నికకు రోజులు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీతో పొత్తు కారణంగా సీటు వారికి వదిలి పెట్టాలా లేదంటే జనసేన అభ్యర్థిని పోటీకి దించాలా అనే విషయాన్ని ఇప్పటికీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తేల్చుకోలేకపోతున్నారనే టాక్ ఉంది. ఇటీవల తిరుపతి లోక్సభ ఉపఎన్నికపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు… బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని క్లారిటీ ఇచ్చారు. అభ్యర్థి ఎవరనే విషయంపై తొందరేమీ లేదన్న ఆయన.. జనసేన – బీజేపీ కి ఆ విషయంలో స్పష్టత ఉందని చెప్పుకొచ్చారు. కానీ ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారో ప్రకటించలేదు. దీంతో జనసేన పార్టీలో అయోమయం నెలకొందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారా?
ఎన్నికల గడువు సమీపిస్తున్న ఇంకా అభ్యర్థిపై తేల్చని నేపథ్యంలో జనసేన పార్టీ నేతల్లో గందరగోళం నెలకొందని అంటున్నారు. పార్టీ అభ్యర్థి పై స్పష్టత ఇవ్వాల్సిందేనని , లేదంటే ప్రజల్లో జనసేన పట్ల మరో రకమైన అభిప్రాయం కలుగుతుందని తేల్చిచెప్పనట్లు సమాచారం . ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లనున్నారు. జనసేన పార్టీ చెందిన కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ ఈనెల 21న తిరుపతిలో భేటీ కానుంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని తిరుపతికి పయనం కానున్నారు. ఈ భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్తో పాటు పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన కీలక విషయాలను చర్చించబోతున్నట్లుగా పార్టీ సమాచారం. మొత్తంగా బీజేపీ నేతలు ఇచ్చే షాక్ లకు , పార్టీ నేతలు చేస్తున్న ఒత్తిడి నేపథ్యంలో పవన్ ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం.