Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన చర్చ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో పొత్తు ఉంటుందని ప్రకటించిన జనసేనాని ఆ ప్రకటన తర్వాత ఆ స్థాయిలో గౌరవం పొందలేకపోతున్నారని అంటున్నారు. దీనికి నిదర్శనం తాజాగా ఆయన చేసిన ప్రకటనే.
జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వంపై మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ జనసేనను చులకన చేసేలా మాట్లాడిందని అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తమతో ఉన్నా… తెలంగాణ రాష్ట్ర నాయకత్వం జనసేనను అవమానించిందని తెలిపారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పీవీ వాణీదేవికి మద్దతిస్తున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఏపీ సంగతి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ప్రశ్నిస్తున్నారు Pawan Kalyan పవన్ కళ్యాణ్ గారు….
తెలంగాణలో తనకు అవమానం జరిగిందని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోవడం సముచితమే కానీ ఏపీ గురించి కూడా ఆలోచించాలని పలువురు సూచిస్తున్నారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి మార్మోగుంది. రిలే నిరాహార దీక్షలు, ధర్నాలతో కార్మికులు తమ నిరసనను.. కేంద్రానికి తెలియజేస్తున్నారు. అటు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వారి పట్ల ఉద్యమకారులు కృతజ్ఞతను చాటుకుంటున్నారు. పోరాటానికి సంఘీభావం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అదే సమయంలో పవన్ స్పందనపై ఎదురుచూస్తున్నారు.
ఇది అవమానం పవన్ గారు..
పొత్తు పెట్టుకున్న తర్వాత అవమానిస్తేనే వేరే పార్టీకి మద్దతు ఇవ్వాలని సూచించిన జనసేనాని ఏపీ ప్రజల ఉనికి చిహ్నం , వేలాది మంది కార్మికుల జీవనోపాధికి మార్గమైన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో అదే స్థాయిలో బీజేపీ ని , కేంద్రాన్ని ప్రశ్నించాలని స్పందించేలా చేయాలని విశాఖ వాసులు కోరుకుంటున్నారు. విశాఖ కార్మికుల ఓట్లతో చట్టసభలో అడుగు పెట్టాలని పోటీ చేసిన పవన్ కల్యాణ్ కనీసం వారికోసమై స్పందించాలని పలువురు అంటున్నారు.