Pawan Kalyan జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఉన్న ఈ వార్తను ఓ సారి చదవండి !
Pawan Kalyan : ఏండి పవన్ కళ్యాణ్ గారు … ఏదైనా మాట్లాడండి.
ఇందులో ఏం ఉందో చూశారు కదా. ఏపీలో సంచలనంగా మారిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు అడుగులు పడుతున్నాయని , దీనిపై వివిధ పార్టీలు తమ వైఖరిని వినిపిస్తున్నాయని పేర్కొనడమే కాకుండా ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టినట్లు చెప్పిన పవన్ కళ్యాణ్ జాడ ఏదని ఏపీ ప్రజల తరఫున `న్యూస్ ఆర్బిట్` సంచలన కథనం ప్రచురించింది. ఈ వార్త కథనం ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించింది. అందరి చూపు పవన్ వైపు పడేలా చేసింది. తాజాగా దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు.
Pawan Kalyan పవన్ సంచలన ప్రకటన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనపై కీలక ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం మీద ప్రధానిని కలుస్తామని అన్నారు. పెట్టుబడులు ఉపసంహరణ కొనసాగించింది కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాగా, జనసేన పార్టీ రథసారథి ప్రకటన ఉద్యమాన్ని ఉధృతం చేయనుందని భావిస్తున్నారు.
విశాఖలో ఏం జరుగుతోందంటే…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఉద్యమం మరింత ఉద్ధృత రూపం దాలుస్తోంది. దీనిపై రాజకీయ…కార్మిక వర్గాలు భగ్గుమంటున్నాయి. ఆందోళనలకు దిగుతున్నాయి. మహా ధర్నా చేపట్టిన కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహాధర్నా కోసం వేలాదిగా కార్మికులు తరలివచ్చారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టారు. సేవ్ స్టీల్ ప్లాంట్ ఆందోళనకు వైసీపీ నేతలు మద్దతు పలికారు. ప్రాణాలు ఇచ్చయినా స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామని నేతలు చెబుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి నిరాహారదీక్షలు, రాజీనామాలకు వెనుకాడబోమని ఎంపీలు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన మహాధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది.