Pawan Kalyan: వరద బీభత్సం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప తదితర జిల్లాల్లో వరద భీభత్సం సామాన్యుడి బ్రతుకుపై తీవ్ర ప్రభావం చూపింది. వరద ముంపు కారణంగా ఇళ్లు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలలోని జనాలు కట్టుబట్టలతో సహాయక శిబిరాలకు చేరుకున్నారు. హృదయ విదారక పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ తరుణంలో ప్రభుత్వం నేడు ఇసుక విక్రయానికి సంబంధించి పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటన విడుదల చేసింది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందిస్తూ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా అంటూ ధ్వజమెత్తారు.
Read More: AP CM YS jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం..! ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావద్దంటూ సూచన..!!
Pawan Kalyan: ప్రభుత్వానికి ఇంగితం ఉందా..?
రాష్ట్రంలో వరదల భీభత్సంతో ప్రజల ఇళ్లు, పశువులు, పంటలు కొట్టుకుపోతున్నాయనీ.. ప్రాణాలు కోల్పోతున్నారనీ..పొలాల్లో ఇసుక మేటలు చూసి రైతులు ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఇసుక అమ్ముతాం అని ప్రకటనలు ఇవ్వటమేమిటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా అంటూ దుయ్యబట్టారు.
నీరోతత్వం ఒంటబట్టిందా..?
మరో పక్క ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఇసుక ప్రకటనపై ట్విట్టర్ వేదికగా స్పందించి నీరో తత్వం ఒంటబట్టిందా ?అని ప్రశ్నించారు. జల ప్రళయంతో చేతికొచ్చిన పంటలు, ఇళ్లు, పశు సంపద, సర్వం కోల్పోయి ప్రజలు బాధల్లో ఉంటే అందరికీ అందుబాటులో ఇసుక అని మీ వ్యాపార ప్రకటన ఏమిటి ?అని ప్రశ్నించారు. వరదలతో జనం సాయం కోసం ఎదురుచూస్తుంటే ప్రచారం కావాల్సి వచ్చిందా నీరోతత్వం ఒంటబట్టిందా ? ఈ అడ్వర్టైజ్మెంట్ అవసరమా ? జగన్ గారూ అని ప్రశ్నించారు.
వరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే,ప్రజల ఇళ్ళు-వాకిళ్లు, పశు నష్టం – పంట నష్టం,
పచ్చటి-పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే , ఇలాంటి
సమయంలో వైసీపీ ప్రభుత్వం 'యిసుక అమ్ముతాం ' అన్న ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ?? pic.twitter.com/43GorfXoZg— Pawan Kalyan (@PawanKalyan) November 21, 2021