Pawan Kalyan : ఇప్పుడు అందరి చూపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై పడింది. ఎందుకంటే ఏపీలో హాట్ టాపిక్గా మారిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎపిసోడ్ విషయంలో. విశాఖ స్టీల్ప్లాంట్లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్నామని కేంద్రం తేల్చి చెప్పింది.
విశాఖ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు నిర్మల సీతారామన్ సమాధానం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్పై కేంద్రం కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన , ఆ పార్టీ రథసారథి పవన్ కళ్యాణ్ ఎలా స్పందించనున్నారనే ఆసక్తి నెలకొంది.
సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే….
పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “డియర్ పవన్ కళ్యాణ్… విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన నేపథ్యంలో మీకు ఇది మరో అవకాశం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అని కేంద్రం చెప్పగానే ఢిల్లీ వెళ్ళి దాని మీద పునరాలోచించాలని కేంద్రానికి చెప్పొచ్చారు. ప్రైవేటీకరణ చేసి తీరతామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా చెప్పింది. ఆంధ్రలో ఒక్క నాయకుడు కూడా దీని మీద గట్టిగా మాట్లాడట్లేదు. మీరు ఇక్కడ భాజపాతో భాగస్వామ్యంలో ఉన్నారు. ఈ విషయంలో దాన్ని పక్కన పెట్టి కేంద్రాన్ని ప్రశ్నించండి. మీకు ఓట్ బ్యాంక్ తక్కువైనా అభిమాన బలం ఎంత ఉందో “2014లో చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజే” భాజపాకీ, ఆరోజు వచ్చిన 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులకీ తెలిసింది. ఢిల్లీ వెళ్ళి మాట్లాడండి.
ప్రైవేటీకరణ ఆపకపోతే ఉద్యమం చేస్తానని చెప్పండి. మీ వంతు పాత్ర పోషించండి. (ప్రైవేటీకరణ ఆపినా, ఆపకపోయినా మీరు పోరాడితే అది మీకు పొలిటికల్ గా కూడా బాగా ఉపయోగపడుతుంది) “ అంటూ లేఖలు షేర్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తారు?
పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ అయిన లేఖ ఆయన అభిమానులు పోస్ట్ చేసిందనేది కాదనలేని నిజం. అయితే, ఇదే సమయంలో ఆయన గురించి రాజకీయ విశ్లేషకులు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ యొక్క జనసేన పార్టీ మూల సిద్ధాంతం ప్రశ్నించడం. ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాను అని చెప్పే పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై స్పందించినట్లే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటం చేస్తారా? తను పోటీ చేసిన నియోజకవర్గంలోని ప్రజలు, ఏపీ ప్రజల గౌరవాన్ని నిలబెట్టేందుకు నడుం బిగిస్తారా? ఏమో వేచి చూడాల్సిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?