Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. పవన్ కళ్యాణ్ దసరా నుండే బస్సు యాత్ర ప్రారంబించాలని భావించి బీజేపీని రోడ్ మ్యాప్ అడిగారు. అయితే బీజేపీ అధిష్టానం నుండి స్పందన లేకపోవడంతో యాత్ర ప్రారంభించలేదు. మిత్ర పక్షం బీజేపీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినా రాకపోయినా త్వరలో బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్దమైయ్యారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో బస్సు యాత్రకు ఉపయోగించే భారీ వాహనాన్ని సిద్దం చేసుకున్నారు. దీనికి సంబంధించి ట్రయల్ రన్ వీడియో, ఫోటోలను పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ బస్సుకు వారాహి అని పేరు పెట్టినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఎన్నికల యుద్దానికి వారాహి సిద్దమైంది అంటూ పవన్ ట్వీట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పవన్ యాత్రకు సిద్దం చేసుకున్న బస్సు అలివ్ రంగులో చూడటానికి మిలిటరీ వాహనం పోలి ఉంది. ఎంతో ధృఢంగా కనిపిస్తున్న ఈ వాహనంలో పవన్ కు అవసరమైన సదుపాయాలు ఏర్పాట్లు చేశారు. ఈ బస్సులో హై సెక్యురిటీ సిస్టమ్ తో పాటు జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీల్లో రికార్డు చేయగల సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, రాత్రివేళల్లో సభల కోసం లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఈ వాహనం ట్రయల్ రన్ ను పవన్ కళ్యాణ్ స్వయంగా తిలకించడంతో పాటు ఆ వాహనంతో దిగిన ఫోటోలు, వీడియోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు.
సూళ్లూరుపేట ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హజరైన ఏపి సీఎం వైఎస్ జగన్
‘Varahi’ is ready for Election Battle! pic.twitter.com/LygtMrp95N
— Pawan Kalyan (@PawanKalyan) December 7, 2022