పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి వైయస్ జగన్ నే టార్గెట్ చేసుకుని ఎక్కువగా ఆయన విమర్శలు చేశారని చాలా మంది చెబుతారు. అంతేకాకుండా ప్రస్తుతం బీజేపీతో పవన్.. చెలిమి చేస్తున్న మరో పక్క చంద్రబాబుకి పార్ట్నర్ గానే అంతర్గతంగా ఉన్నారు అనే టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఉంది. అటు చంద్రబాబుతో అయినా ఇటు బీజేపీతో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్ టార్గెట్ మాత్రం జగనే అని చెబుతుంటారు. అటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా సీఎం జగన్ కి థాంక్స్ చెప్పారు.
మేటర్ లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా దివిస్ పరిశ్రమ తీసేయాలని ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల గ్రామ ప్రజలు చేసిన పోరాటానికి పోలీసులు అరెస్టు చేయడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల దివిస్ ప్రాంతం లో పవన్ కళ్యాణ్ పర్యటించి.. పరిశ్రమ యాజమాన్యం పై అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అంతేకాకుండా పరిశ్రమను తీసేయాలని లేకపోతే పోరాటం చేస్తామన్న టు పవన్ కళ్యాణ్ డైలాగ్ లు వేశారు. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ దివీస్ నిరసనకారులను అరెస్టు చేసిన వారిని విడుదల చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో హైకోర్టు అదేవిధంగా సీఎం జగన్ కి పవన్ పార్టీ తరఫున లేఖను విడుదల చేసి థాంక్స్ తెలిపారు. అంతేకాకుండా ఉన్న కేసులను పూర్తిగా ఎత్తివేయాలని కోరారు.