Denduluru: దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి ఎండిఓ జీఆర్ మనోజ్ బుధవారం ఉపాధి హామీ పనులను పరిశీలించారు. పెదవీగి మండలం జానంపేట గ్రామంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి ఉపాధి హామీ కూలీలు పనులు ఏ విధంగా నిర్వహిస్తే వారికి గిట్టుబాటు అవుతుంది. సరైన కూలీ లభిస్తుంది అనే విషయాలను వివరించారు. నిర్దేశించిన సమయానికే ఉపాధి హామీ పనులకు రావాలని చెప్పారు.
ఫీల్డ్ అసిస్టెంట్ లు ముందుగానే మేట్లకు పనిపై అవగాహన కల్పించాలనీ, అదే విధంగా పనికి తగిన వేతనం కూలీలకు అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఒక రోజుకు వేతనంగా రూ.270లు ప్రభుత్వం ఉపాధి కూలీలకు ఇవ్వడం జరుగుతుందని, నిర్దేశించిన పని ని పూర్తి చేసినప్పుడే పూర్తి వేతనం లభిస్తుందని దానికి అనుగుణంగా కూలీలు పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సలోమి, ఫీల్డ్ అసిస్టెంట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం జగన్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం