PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపి పర్యటన ఖరారైంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోనున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి లు ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్నారు. ఆ రోజు రాత్రి ప్రధాని మోడీ విశాఖలోనే బస చేస్తారు. మరుసటి రోజు 12వ తేదీ ఉదయం ఆంధ్రా యూనివర్శిటీలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పలు పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు, రూ.260 కోట్లతో చేపట్టిన వడ్లపూడి లో వ్యాగన్ వర్క్ షాపు, రూ.26వేల కోట్లతో చేపట్టిన హెచ్పీసీఎల్ నవీకరణ, విస్తరణ పనులు, రూ.445 కోట్లతో చేపట్టిన ఐఐఎం పరిపాలనా భవనానికి ప్రధాని మోడీ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదే విధంగా రూ.152 కోట్లతో చేపట్టనున్న చేపలరేవు నవీకరణ ప్రాజెక్టు, రూ.560 కోట్లతో కాన్వెంట్ కూడలి నుండి షీలానగర్ వరకు పోర్టు రహదారికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. కాగా ప్రధాని పర్యటనకు సంబంధించి విశాఖ నగరంలో ఏర్పాట్లను వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ తో కలిసి ఏయూ కాలేజీ గ్రౌండ్ ను పరిశీలించారు. ఈ సందర్భంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖలో ఏడు ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభిస్తారని తెలిపారు. ప్రధాని మోడీ, సీఎం వైఎస్ జగన్ తో కలిసి విశాఖలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు.
ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన పర్యటన కాదనీ, ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ దీన్ని క్లైమ్ చేసుకోదని అన్నారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే అన్ని రాజకీయ పార్టీలు స్వయంగా ఆహ్వానం పలుకుతారని దీన్ని రాజకీయం చేయవద్దని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12న ఉదయం కాలేజీ మైదానంలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. పీఎంవో, సీఎంవో అధికారులు చర్చించి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ షెడ్యుల్ ను త్వరలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ రోజు ప్రధాన మంత్రి కార్యాలయం నుండి వచ్చిన సమాచారం ప్రకారం పీఎం మోడీ ఏడు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారని చెప్పారు. రైల్వే జోన్ ఇస్తామని గతంలో కేంద్ర రైల్వే మంత్రి ప్రకటించారనీ, అయితే ప్రధాని పర్యటనలో ఈ ప్రొగ్రామ్ కవర్ అవుతుందా లేదా అనేది త్వరలో తెలియజేస్తామన్నారు విజయసాయి రెడ్డి.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ షాక్ .. విచారణకు హజరు కావాలంటూ నోటీసులు