కొందరు హత్యాచారం లాంటి నేరాలు చేసి సాక్షం దొరకకుండా తప్పించుకోవాలని అనుకుంటుంటారు. కానీ ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ పరిశీలన, సాంకేతిక ఆధారాలతో పోలీసులు.. దోషులను పట్టుకుంటారు. ఓ వృద్ధురాలిపై అత్యాచారం చేసిన యువకుడు .. ఆ విషయాన్ని ఆమె బయటపడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని భావించి హత్య చేశాడు. కానీ పోలీసు జాగిలాలు ఆ నిందిడుడి పట్టించాయి. ఈ ఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లలో జరిగింది.
విప్పర్ల గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని యువకుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆరుబయట పడుకున్న ఆమె శనివారం ఉదయం పొద్దుపోయినా లేవకపోవడంతో పరిసర ప్రాంతాలకు చెందిన వారు అక్కడకు వెళ్లి ఆమెను లేపేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె శరీరంపై గాయాలు ఉండటంతో పాటు దుస్తులు తొలగించి ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా అనుమానించారు.
నిందితుడిని పట్టుకునే క్రమంలో ఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్ పోలీసు జాగిలాన్ని తీసుకురాగా, ఘటన స్థలం వద్ద పరిశీలించిన జాగిలం అక్కడికి సమీపంలోనే ఉన్న పెరవలి మణికంఠ (27) ఇంట్లోకి వెళ్లింది. దీంతో పోలీసులు మణికంఠను అదుపులోకి తీసుకుని విచారించగా, తానే ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
ఏపి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ..జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు