ట్విట్టర్ ను సొంతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే సమయంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే న్యూ ఓనర్ ఎలాన్ మస్క్ త్వరలో ట్విట్టర్ యూజర్ల నుండి ఏటా కొంత మొత్తం వసూలు చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే తాజాగా బ్లూటిక్ ఉన్న ప్రముఖులు అందరికీ బిగ్ షాక్ ఇచ్చింది ట్విట్టర్ సంస్థ. దేశంలోని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీతారలు ఇలా సెలబ్రిటీల అకౌంట్ల బ్లూటిక్ ను ట్విట్టర్ తొలగించింది. వీళ్లు బ్లూటిక్ కు చెల్లించాల్సిన చార్జీ చెల్లించకపోవడంతో చాలా మంది అకౌంట్ ల బ్లూటిక్ తొలగించింది ట్విట్టర్.
బ్లూటిక్ తొలగించిన లిస్ట్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. టీడీపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అలానే సమంత, కోహ్లీ, రోహిత్ శర్మ, మెగాస్టార్ చిరంజీవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇలా చాలా మంది ఉన్నారు. బ్లూ టిక్ పోవడంతో ఈ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ లో ఒకే పేరుతో అనేక ఫేక్ అకౌంట్ లు ఉన్నాయి. దీంతో బ్లూటిక్ ఉన్న వాటినే అధికారిక అకౌంట్ గా గుర్తించే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ట్విట్టర్ బ్లూటిక్ తొలగించడంతో ఏది అఫిషియల్ అకౌంట్.. ఏది ఫేక్ అకౌంట్ అనేది తెలుసుకోవడం సోషల్ మీడియా యూజర్లకు తలనొప్పిగా మారుతోంది. నిన్నటి వరకూ తమ అకౌంట్ లకు ఉన్న బ్లూటిక్ తొలగించడంతో సదరు ఖాతాదారులు బ్లూటిక్ పునరుద్దరణ కోసం ట్విట్టర్ ను సంప్రదించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తొంది. ఈ ప్రముఖులు అందరూ ఒక్క సారిగా తమ బ్లూటిక్ పునరుద్దరణకు కట్టాల్సిన చార్జీలు చెల్లించే అవకాశం ఉంది. దీంతో ట్విట్టర్ కు భారీగా ఆదాయం సమకూరుతుంది.
ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు సజీవ దహనం .. జవాన్ల వ్యాన్పై గ్రనైట్ దాడి.. ఆ తర్వాత కాల్పులు