Raghurama Vs YCP: రెండున్నర సంవత్సరాల తరువాత అయినా ప్రధాని మోడీ పర్యటనతో సొంత గడ్డపై అడుగుపెట్టాలనుకున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కల సఫలం కాలేదు. నరసాపురం లోక్ సభ స్థానం నుండి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా గెలిచిన రఘురామ కృష్ణరాజు కొద్ది నెలలోనే రెబల్ గా మారారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో పాటు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పై రచ్చబండ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విమర్శలు, ఆరోపణలు చేయడం ప్రారంభించారు. దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించి పార్టీ నుండి బహిష్కరించాలని వైసీపీ అధిష్టానం భావించింది. ఆయన పై లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేసింది వైసీపీ. అయితే నెలలు గడుస్తున్నా ఆయనపై లోక్ సభ స్పీకర్ చర్యలు తీసుకోలేదు. ఈ తరుణంలోనే రఘురామ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నరసాపురం నియోజకవర్గ పరిధిలో పలు కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వం వర్సెస్ రఘురామ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయారు. రాజద్రోహం తదితర సెక్షన్ల కింద ఆయన పై కేసులు నమోదు చేయడం, అరెస్టు చేసి జైలుకు తరలించడం లాంటి ఘటనలు జరిగిపోయాయి. ఇంకా పలు పోలీస్ స్టేషన్ లపై కేసులు నమోదు అయి ఉండటంతో హైకోర్టును ఆశ్రయించి ఆరెస్టుల నుండి మినహాయింపు పొందారు రఘురామ. రాష్ట్రంలో అడుగు పెడితే ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తారన్న భయంతో రెండున్నరేళ్ల నుండి రఘురామ ఎపికి రావడం లేదు. సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి పండుగలకు కూడా స్వగ్రామం భీమవరంలో అడుగు పెట్టలేకపోయారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తాజాగా ఈ రోజు (జూలై 4) తన నియోజకవర్గ పరిధిలోని భీమవరంలో ప్రధాని మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో కార్యక్రమంలో హజరు అవ్వాలని భావించారు. ప్రభుత్వం కొత్త కేసులు ఏమైనా నమోదు చేసి అరెస్టు చేస్తుందేమో అన్న భయంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. పోలీసులు కొత్తగా ఏదైనా కేసులు నమోదు చేసినా చట్ట, న్యాయపరిధిలో నడుచుకోవాలని, వెంటనే అరెస్టు చేయవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో భీమవరంకు హెలికాఫ్టర్ లో వచ్చేందుకు రఘురామ ప్రయత్నం చేశారు. అయితే హెలికాఫ్టర్ లాండింగ్ కు ముందుగా అనుమతి ఇచ్చి తరువాత కాన్సిల్ చేసినట్లు రఘురామ చెబుతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి అయినప్పటికీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవ కార్యక్రమాలకు రఘురామకు అహ్వానం పంపలేదు. ప్రధానితో వేదిక పంచుకునే జాబితాలో ఆయన పేరు లేదు. అయినప్పటికీ కార్యక్రమంలో పాల్గొనేందుకు రఘురామ ఆదివారం రాత్రి నర్సాపుర్ ఎక్స్ ప్రెస్ లో తన భద్రతా సిబ్బందితో బయలుదేరారు.
ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. తొలుత ఫేస్ బుక్ లైవ్ లో తాను నర్సాపుర్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరినట్లు వెల్లడించారు రఘురామ. తనను ఎపి ఇంటెలిజెన్స్ పోలీసులు ఫాలో అవుతున్నారని కూడా చెప్పారు. భీమవరంలో తనకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్బందులు గురి చేస్తున్నారనీ, వారి పేరెంట్స్ తో తనకు ఫోన్ చేయించి భీమవరం రావద్దు చెప్పించారని రఘురామ పేర్కొన్నారు. తనకు మద్దతు ఇచ్చే నాయకులపై కేసులు కూడా నమోదు చేశారని ఆరోపించారు. తనకు మద్దతు ఇచ్చే వాళ్లకు ఇబ్బందులు కల్గించవద్దన్న ఉద్దేశంతో భీమవరం పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన రఘురామ బేగంపేట రైల్వే స్టేషన్ లో దిగిపోయి హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఈ సందర్భంలో ప్రభుత్వం తన పట్ల అనుసరించిన వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రఘురామ. రఘురామ మిడిల్ డ్రాప్ వ్యవహారం ఏపి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?