RaghuRama krishna raju: ఏపిలో జగన్ సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు కోర్టులు తప్పుబడుతున్నాయి. న్యాయ సమీక్షలో నిలబడటం లేదు. విమర్శలకు దారి తీస్తున్నాయి. ప్రభుత్వానికి ఇటువంటి సలహాలు ఎవరు ఇస్తున్నారు అంటూ ప్రజలే చర్చించుకుంటున్నారు. వినాయక చవితి వేడుకల విషయంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నారో ఆదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ముందుగా ప్రకటించి ఉంటే కోర్టు ద్వారా చెప్పించుకనే అవసరం ఉండేది కాదు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ విషయం అలా ఉంచితే..ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇసుక, మద్యం అమ్మకాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమా హాళ్లలో టికెట్ ల విక్రయాలు ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ ఆధీనంలో చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకున్న దాఖలాలు లేవు. ఇలా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల విమర్శలు వస్తున్నాయి.
తాజాగా ఏపి ప్రభుత్వం మటన్ విక్రయాలకు సిద్ధమవుతోందట. మటన్ మార్ట్ ల పేరిట త్వరలో ప్రభుత్వ మాంసం విక్రయ శాలలు అందుబాటులోకి రానున్నాయని వార్తలు వస్తున్నారు. దీనిపై వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. జగనన్న మాంసం దీవెన అంటూ ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మటన్ అమ్మడం ఏంటండీ..నీఛంగా..రాష్ట్ర ప్రభుత్వం మాంస విక్రయిస్తుందా..ఛీ అంటూ ఘాటుగా స్పందించారు రఘురామ కృష్ణంరాజు.
మటన్ మార్ట్ లకు సంబంధించి ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని రఘురామ చదవి వినిపిస్తూ..ఇలాంటి వ్యాపారాలకు బదులు రైతులు పండించే కూరగాయలకు మెరుగైన ధరలు లభించేలా చూడాలని హితవు పలికారు. ప్రభుత్వం మటన్ బదులు కూరగాయలు విక్రయిస్తే ఆ పథకం కశ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. ఈ పథకానికి జగనన్న కూరగాయ దీవెన అని పేరు పెట్టుకోవాలని రఘురామ సూచించారు.