Raghuveera Reddy: రఘువీరారెడ్డి… కాంగ్రెస్ సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీకి పిసిసి అద్యక్షునిగా పని చేసి ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి. రెండుసార్లు మంత్రి పదవులు చేపట్టి రఘువీరారెడ్డి గత కొద్దికాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన రైతుగా పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. కొద్దికాలం క్రితం హఠాత్తుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇటీవల ఓటింగ్ సమయంలో ఆయన సాదాసీదా జీవన శైలి చర్చకు తెరలేపింది.
రఘువీరా రెడ్డి మళ్లీ వార్తల్లో…
రఘువీరా రెడ్డి తన స్వగ్రామమైన అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో దేవాలయాల నిర్మాణం చేపట్టి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈరోజు తన స్వగ్రామమైన నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రఘువీరా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు క్రీడాకారులతో కరచాలనం చేసి బ్యాట్ తో బంతిని కొట్టి, క్రీడాకారులకు ఉత్సాహం నింపి టోర్నమెంట్ను రఘువీరారెడ్డి ప్రారంభించారు. పంచ కట్టుతో తలకు పాగా చుట్టుకుని బ్యాట్ తో బంతిని కొడుతున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రఘువీరారెడ్డి సాదాసీదా జీవితం మళ్లీ చర్చల్లో నిలిచింది.