Ragurama Krishnaraju: తనదైన శైలిలో కామెంట్లతో వార్తల్లో నిలిచి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎట్టకేలకు బెయిల్ దక్కింది. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 24 గంటల ముందే విచారణకు సీఐడీ నోటీసులివ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, బెయిల్ దొరికినప్పటికీ రఘురామకృష్ణరాజు బ్యాడ్ టైం కొనసాగుతోందని పలువురు పేర్కొంటున్నారు.
షరతులు వర్తిస్తాయి…
ఎంపీ రఘురామ కృష్ణరాజుకు బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టులో హాట్ హాట్గా వాదనలు సాగాయి. అనంతరం షరతులతో కూడిన బెయిల్ను రఘురామ కృష్ణరాజుకు సుప్రీం కోర్టు మంజూరు చేసింది.10 రోజుల్లోపు లక్ష రూపాయలు చొప్పన ఇద్దరు పూచీ కత్తు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణలో భాగంగా నోటీసులు విచారణకు 24 గంటల ముందే ఇవ్వాలని పేర్కొంది. సీఐడీ విచారణకు సహకరించాలని ఎంపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. రఘురామ న్యాయవాది సమక్షంలోనే విచారించాలని న్యాయస్థానం సూచించింది. ఈ సందర్భంగా పలు షరతులను న్యాయస్థానం రఘురామకృష్ణంరాజుకు విధించింది.
రఘురామ అవాక్కయ్యే షరతులు…
బెయిల్ మంజూరు చేస్తూనే సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కేసుపై మీడియాలో మాట్లాడకూడదని రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టరాదని తేల్చిచెపుతూ సోషల్ మీడియా, మీడియా ముందుకు రాకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పేసింది. ఈకేసు సంబంధించి ఒకవేళ మీడియాతో మాట్లాడితే సీరియస్ గా పరిగణిస్తామని రఘురామ కృష్ణరాజును సుప్రీం కోర్టు హెచ్చరించింది. కాగా, మీడియాతో మాట్లాడటాన్ని ఇష్టపడే ఎంపీకి ఇది బ్యాడ్ న్యూస్ అని పలువురు కామెంట్ చేస్తున్నారు.