ఇటీవల కురిసన అకాల వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచేశాయి. చేతికి అందాల్సిన పంట కళ్లెదుటే నేలకొరగడంతో బాధిత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. వేలాది హెక్టార్లలో పంటలకు వర్షం అపార నష్టం మిగిల్చింది. కోత దశలో ఉన్న అరటి, కొర్ర తదితర పంటలతో పాటు తోటల్లో మామిడి కాయలు నేలరాలాయి. మొక్కజొన్న, జొన్న, వేరుశనగ పంటలు తడిసి ముద్దయ్యాయి. అదే విధంగా బెండ, నూగు, సజ్జ పంటలు మరో 50 ఎకరాల్లో దెబ్బతిన్నాయి.
పలు ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులు, వడగండ్ల వర్షం వల్ల మామిడి, అరటి, వరి, నూగు పంటలు దెబ్బతిన్నాయి. నూగు, వరి పంటల్లో నీరు నిలవడంతో పంట నేలకొరిగింది. చేతికి వచ్చే పంట నేలకొరగడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. వర్షం అంటేనే రైతులు హడలిపోతున్న ఈ తరుణంలో మరో సారి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తమిళనాడు నుండి కర్ణాటక, మరఠ్వాడ, విదర్భ, మధ్యప్రదేశ్ మీదుగా బీహార్ వరకూ ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రం నుండి వీస్తున్న తేమ గాలుల ప్రభావంతో ఆదివారం కోస్తా లో ఎక్కువ చోట్ల మేఘాలు ఆవరించాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న 48 గంటల్లో కోస్తాలో పలు చోట్ల ఉరుములు, పిడుగులతో.. రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
MP Vijaya Sai Reddy: సీఎం జగన్ నిర్ణయాలతో ఏపిలో భారీ బడ్జెట్ సినిమా షూటింగ్లు