Raptadu : ఆంధ్రప్రదేశ్ లో Andhra Pradesh స్థానిక పంచాయతీ ఎన్నికల local body elections కోలాహలం కొనసాగుతోంది. మొదటి దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. కాగా రెండవ దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభం అయ్యింది. కొన్ని జిల్లాల్లో నామినేషన్ ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిపోగా కొన్ని గ్రామాల్లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. అనంతపురం రాయదుర్గం నియోజకవర్గంలోని ఒక పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిని వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేసి సర్పంచ్ పదవికి పోటీ చేయవద్దంటూ దాడి చేశారు.
కాగా రెండవ దశ నామినేషన్ల ఏర్పాట్లు ప్రారంభం అయిన నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా అనంతరం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గాన్ని సమస్యాత్మక గ్రామంగా గుర్తించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను దింపడమే కాక జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు స్వయంగా భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నామినేషన్ల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రాప్తాడు ఎండిఓ, తహశీల్దార్ కార్యాలయాల వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక నామినేషన్ కేంద్రాల వద్దకు ఎలాంటి వాహనాలు అనుమతించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎవరి వాహనాలు అయినా నామినేషన్ కేంద్రానికి కనీసం వంద మీటర్ల దూరంలో నిలుపుదల చేసేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా జిల్లా ఎస్పీనే ఇక్కడ పరిస్థితి సమీక్ష జరుపుతున్నారు అంటే ఇది ఎంత సమస్యాత్మకమో అర్థం అవుతోంది. ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేయడం పోలీసు యంత్రాంగానికి సవాలే. ప్రస్తుతం రాయలసీమలో గతంలో మాదిరిగా ఫ్యాక్షన్ పరిస్థితులు లేకపోయినా గ్రామాల్లో అధిపత్యం కోసం ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు జరిగే అవకాశాలు ఉంచాయి. ఇంటెలిజిన్స్ వర్గాల నివేదిక ఆధారంగా రాప్తాడులో బందోబస్తు చర్యలను కొనసాగిస్తున్నారు. ఎన్నికల సందర్భంలో వివాదాలు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామనీ, ఏ పార్టీ నాయకులు అయినా కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరిస్తున్నారు.