Sonu Sood: రియల్ హీరో సోనూ సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ అయ్యారు. చిన్నారుల నుండి పెద్దల వరకూ ఆయన ధాతృత్వానికి, సేవా నిరతికి ఫిదా అవుతున్నారు. గత ఏడాది కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాలు చేయాల్సిన పనిని తన భుజస్తందాలపై వేసుకుని వలస కార్మికులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపడం దేశ ప్రజానీకాన్ని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా అనేక మంది పేద వర్గాల సమస్యలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని స్పందించి ఆదుకున్నారు. కొందరు అభిమానలైతే ఆయన పేరుతో స్టాల్స్ ను ఏర్పాటు చేసుకున్నారు. చిత్రలేఖనంపై అభివృచి ఉన్న చిన్నారులు, యువకులు సోను సూద్ చిత్రాలను కళాత్మకంగా తీర్చి దిద్ది తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఇదే క్రమంలో ఇటీవల శ్రీకాకుళం నగరానికి చెందిన లాల్ ప్రసాద్ అనే యువకుడు తయారు చేసిన సోనూ సూద్ చిత్రాన్ని టీడీపీ ఎంపి కె రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ లో పోస్టూ చేస్తూ సోనూ సేవలను ప్రశంసించారు. దీనికి సోనూ సూద్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఆ యువకుడిని తీసుకొని మీరు లంచ్కి రావాలంటూ రామ్మోహన్ నాయుడుని ఆహ్వానించారు.
ప్రస్తుత కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కు కొరత ఏర్పడింది. ఆక్సిజన్ కొరత నివారణకు ప్రభుత్వాలు ఓ పక్క కృషి చేస్తున్నా అనేక ప్రాంతాల్లో అక్సిజన్ అందక ప్రాణాలను విడుస్తున్న వారిని చూసి చలించిన సోనూ సూద్ ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడానికి సైతం సిద్ధమయ్యారు. ముందుగా నాలుగు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించిన సోనూ సూద్ ఫ్రాన్స్ తో పాటు ఇతర దేశాల నుండి వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర తో పాటు కేసులు ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో వీటిని సోనూ సూద్ ఏర్పాటు చేయనున్నారు. తొలి ప్లాంట్ ఫ్రాన్స్ నుండి మరో పది రోజుల్లో భారత్ కు రానుంది. ఆక్సిజన్ సిలిండర్ లు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది బాధపడుతున్నారనీ, దాంతో ఇప్పటికే పలు చోట్ల సిలిండర్ లు ఏర్పాటు చేశామన్న సోనూ సూద్ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు వల్లనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
Thank you so much sir for sharing Lal Prasad's amazing work. Really looking forward meeting him in person. We all will soon plan a lunch together ?? https://t.co/Jtt1NMlmMn
— sonu sood (@SonuSood) May 11, 2021