Republic Day Celebration: ఏపి, తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు భిన్నంగా జరిగాయి. ఏపిలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రాజ్ భవన్ లో వేడుకలను నిర్వహించారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ వేడుకల్లో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వ పథకాలు బేష్ అంటూ ప్రసంగించారు. ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగ పాఠంపై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
మరో పక్క తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్ భవన్ వేదిగా నిర్వహించారు. గవర్నర్ తమిళి సై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రులు గైర్హజరు అయ్యారు. సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితర ఉన్నతాధికారులు మాత్రం హజరైయ్యారు. తెలంగాణలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య వార్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు మరో సారి రుజువు అయ్యింది. ఇక్కడ గవర్నర్ తమిళి సై తన ప్రసంగంలో సీఎం కేసిఆర్ సర్కార్ పరోక్షంగా విమర్శించారు. సీఎం కేసిఆర్ కు చురకలు అంటేలా మాట్లాడారు. హైదరాబాద్ లో రిపబ్లిక్ డే ముగిసిన వెంటనే గవర్నర్ తమిళి సై.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లారు. కరోనా పరిస్థితుల మూలంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజ్ భవన్ లోనే నిర్వహించాలని వారం రోజుల క్రితమే ప్రభుత్వం లేఖ రాసింది. కోవిడ్ పరిస్థితులు అంటూ ప్రభుత్వం చెప్పడాన్ని తెలంగాణ హైకోర్టు ఆక్షేపణ వ్యక్తం చేసింది. కోవిడ్ ఆంక్షలు ఎక్కడ ఉన్నాయంటూ కూడా ప్రశ్నించింది.
ఏపిలో గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య అప్యాయంగా పలకరింపులు, ప్రభుత్వ పరిపాలనా తీరును ప్రశంసిస్తూ గవర్నర్ ప్రసంగం ఉండగా, తెలంగాణలో వేడుకలకే ముఖ్యమంత్రి గైర్హజరు కావడం, గవర్నర్ తన ప్రసంగంలో ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించడం గమనార్హం.
Padma Awards 2023: ఏపి నుండి పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న ప్రముఖులు, వారి విజయాలు