Revanth reddy : రేవంత్ రెడ్డి… కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ లో ఉన్న ఫైర్ బ్రాండ్ నేతల్లో ఆయన ఒకరు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నాయకుడు. తన సహజసిద్ద దూకుడుకు కొనసాగింపుగా రాజీవ్ రైతు భరోసా దీక్షను పాదయాత్రగా మార్పు చేశారు.
అచ్చంపేట నుంచి హైదరాబాద్కు రేవంత్ పాదయాత్ర కొనసాగుతోంది. రేవంత్ యాత్రకు హైకమాండ్ అనుమతి లేదంటూ సీనియర్ల పెదవి విరుస్తున్నా..అధిష్టానం సూచనతోనే పాదయాత్ర చేస్తున్నానని రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పాదయాత్రలతో రైతుల వద్దకు వెళ్లాలని అదిష్టానం పంపిన నోట్ బయటపడడంతో నేతలు చల్లబడ్డారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మళ్లీ బీపీ పెంచే ప్రయత్నం చేశారు.
Revanth reddy రేవంత్ స్టైలే వేరు…
వివిధ అంశాలపై అధికార పార్టీని, సీఎంను, మంత్రులను ఇలా అందరినీపై డైరెక్ట్గా ఫైర్ బ్రాండ్ రేవంత్ ఎటాక్ చేస్తుంటారు. ఏ విషయంలోనైనా నిలదీయడంలో ముందుంటారు. ఇక, తెలంగాణ పీసీసీ చీఫ్ రేస్లో రేవంత్ రెడ్డి ఉన్నాడన్న చర్చ సాగుతోన్న సమయంలో.. ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే, రేవంత్ పాదయాత్రవైపు ఉత్తం, భట్టి, కోమటిరెడ్డి బ్రదర్స్, విహెచ్, జగ్గారెడ్డి లాంటి నేతలు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. మరోవైపు…రేవంత్ పాదయాత్ర ఫెయిల్యూర్ అంటూ హైకమాండ్కు కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే రేవంత్ పాదయాత్రలో జనాదరణకు..పార్టీ నేతల ఫిర్యాదులకు పొంతన లేకపోవడంతో ఢిల్లీ నేతలు అవాక్కయ్యారట.
ఢిల్లీ పీఠం తో షాక్ ఇచ్చిన రేవంత్
రేవంత్ యాత్రకు హైకమాండ్ అనుమతి లేదంటూ సీనియర్ల పెదవి విరుపులు వినిపిస్తున్న సమయంలో అదిష్టానం పంపిన నోట్ బయటపడింది. దీంతో నేతలు సైలెంట్ అయ్యారట. పాదయాత్ర ముగింపులో ఈనెల 16న రావిర్యాలలో రేవంత్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రేవంత్ సభకు పార్టీలో ముఖ్య నేతలు ఎవరెవరు హాజరవుతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కేసీఆర్ కు సైతం….
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన పెన్షన్ల హామీ ఇంకా అమలు కాలేదని ఈ లేఖ లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 60 నుంచి 57 ఏళ్లకు తగ్గింపు హామీ రెండేళ్లయినా అతిగతీ లేదని మండిపడ్డారు. 2018 తర్వాత భర్తలను కోల్పోయిన ఒంటరి మహిలలను గుర్తించి తక్షణమే పింఛన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. గత రెండేళ్లుగా లక్షలాది మంది అర్హులు పెన్షన్లకు దూరమయ్యారని.. పెన్షన్లకు అర్హులైన వారిని గుర్తించేందుకు ఎన్యూమరేషన్ చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.