Revanth Reddy: మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులు అవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కొడంగల్లో రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్యేగా గెలుపొందిన పట్నం నరేందర్ రెడ్డి తాజాగా రేవంత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని జోకర్ల చూస్తారని… పీసీసీ అధ్యక్షునిగా చూడరని మండిపడ్డారు. గత ఎన్నికల్లో కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటనన్నావు అన్నావు కానీ తీసుకోలేదు అంటూ కొడంగల్ లో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
Read More: Revanth Reddy: కేసీఆర్ కంటే ముందు… కాంగ్రెస్ నేతల సంగతి చూస్తున్న రేవంత్
రేవంత్ తెలిసి మాట్లాడుతాడో..
కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అబద్దపు కామెంట్లు చేశారని పట్నం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ తెలిసి మాట్లాడుతాడో.. తెలియక మాట్లాడుతాడో కానీ.. గతంలోనే కొడంగల్ అభివృద్ధిపై అంబేద్కర్ చౌరాస్తా వద్ద చర్చకు రమ్మంటే తోక ముడిచాడని పట్నం గుర్తు చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు నీకు పీసీసీ ఇవ్వడం పిచ్చోడి చేతిలో రాయి వంటి నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. నీ పార్టీ ఎంపిలే పీసీసీ ఛీఫ్ పదవి అమ్ముకున్నారు అని అంటున్నారు. అని రేవంత్ విషయంలో ఎద్దేవా చేశారు.
Read More: Revanth Reddy: రేవంత్ దూకుడు మొదలైందిగా… అప్పుడే కేటీఆర్ విషయంలో…
రేవంత్ బ్లాక్ మెయిల్ చేశాడా?
సమాచార హక్కు చట్టంతో రియల్ ఎస్టేట్ వారిని, పారిశ్రామిక వేత్తలను బ్లాక్ మెయిల్ చేశారని నరేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. “ఇప్పుడు నీవు పీసీసీ తీసుకుంది ప్రజా సమస్యలపై పోరాడటం కోసం కాదు.. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడానికి మాత్రమే. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలపై మాట్లాడలేక వ్యక్తిగత దూషణలకు రేవంత్ దిగుతున్నాడు. నాపై ఆరోపణలు చేసావు, వాటిని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అని సవాల్ చేస్తున్న, మరి నీవు నిరూపించకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా. గతంలో చాలాసార్లు సవాల్ చేసి తోకముడిచిన చరిత్ర నీది. టీవీలు, పత్రికల ముందు మాట్లాడుడే తప్ప నీకు ధైర్యం లేదు. ఇప్పటికైనాఅబద్దాలు ఆడడం మాను..’’ అంటూ రేవంత్ పై కొడంగల్ ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు.