Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు వేయడమనే లక్ష్యంలో బిజీగా ఉండే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా మరో కీలక కామెంట్లు చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదంతా కేసీఆర్ ఎత్తుగడని అంటున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోతిరెడ్డిపాడు తెలంగాణ ప్రజల పట్ల మరణ శాసనం కాబోతుందని దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ అప్పట్లోనే చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు.
Read More: Revanth Reddy: షర్మిల పార్టీని బలహీనం చేసే పనిలో రేవంత్?!
కేసీఆర్ను ఇరికించేలా…
దివంగత మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్ రెడ్డి కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని తన నివాసంలో రేవంత్ రెడ్డి సహా మరికొందరు నేతలు కలిశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడడం కోసం పోతిరెడ్డిపాడు పొక్కను మూయాల్సిందేనని పీజేఆర్ ఆ రోజు అన్న విషయం నేడు నిజమైందని చెప్పారు. కృష్ణా నదీ జలాలు తెలంగాణ ప్రజల జన్మ హక్కు అని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పీజేఆర్ అదే పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి కూడా నాటి సీఎం వైఎస్ఆర్ను బెదిరించి తెలంగాణ కోసం కట్టె పట్టుకుని నిలబడ్డాడని గుర్తు చేశారు. కానీ నేడు కృష్ణా జల వివాదాలపై సీఎం కేసీఆర్ మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారే తప్ప పరిష్కారం కోసం ప్రయత్నించడం లేదని ఆరోపించారు.
Read More: KCR: కేసీఆర్కు ఇంత కులపిచ్చి ఉందా?
పీజేఆర్ విషయంలో…
విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా, పీజేఆర్ వారసుడిగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ కాంగ్రెస్లో అందరికీ సన్నిహితులని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే పీజేఆర్..- పీజేఆర్ అంటే కాంగ్రెస్ అన్న ప్రభావాన్ని చూపించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రానప్పుడు ఎల్పీ నేత గా ఒక్కడు వందమందితో సమానంగా ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేసిండని గుర్తు చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో నీటి సమస్య తీరింది అంటే దానికి పీజేఆర్ కృషి ఎంతో ఉందన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?