Revanth Reddy: ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పెద్దల నిర్ణయంపై ఆ పార్టీలో ఓ వైపు చర్చ జరుగుతుంటే మరోవైపు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ ఓ వైపు ఇలా జరుగుతుంటే మరోవైపు రేవంత్ తన దూకుడు కొనసాగిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు.
Read More: Revanth Reddy: ఇప్పుడుంటుంది అసలు మజా… పీసీసీ రథసారథిగా రేవంత్!
ఆ నిర్ణయంపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు…
జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ వర్చువల్ గా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు డైరెక్ట్ గా జరుగుతుంటే గ్రేటర్ సమావేశాలు ఆన్లైన్లో జరపడం ఏంటని ప్రశ్నించారు. జూమ్ మీటింగ్ వెనక దురుద్దేశాలున్నాయని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలు మర్చిపోయారని మండిపడ్డారు. సమస్యలపై జీహెచ్ఎంసీ పాలకమండలిని…విపక్షాలు నిలదీయకుండా ఉండేందుకే ఈ విధంగా చేశారన్నారు. మీడియాను జీహెచ్ఎంసీలోకి ఎందుకు అనుమతించట్లేదన్నారు.
Read More: KCR: కేసీఆర్ అవాక్కయ్యేలా చేస్తున్న కాంగ్రెస్
కేటీఆర్ గురించి ఆ విధంగా మాట్లాడి…
కాంగ్రెస్ హయాంలో జిహెచ్ఎంసి కి క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అవార్డులు వచ్చాయని.. ఇపుడు చెత్త నగరంగా మారిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఉన్న క్లీన్ మెట్రో సిటీస్ లో హైదరాబాద్ కి స్థానం లేదన్నారు. నిదులు రాబట్టడంలో అధికారులు విఫలమయ్యారని, ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో జీహెచ్ఎంసీ అప్పుల్లోకి వెళ్లిందని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ని చెత్త నగరంగా తయారు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫ్యాషన్ షో క్యాట్ వాక్..కేటీఆర్ క్యాట్ వాక్..రెండు ఒకేలా ఉంటాయని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.