Revanth Reddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నియామకంలో ఉత్కంఠకు తెరపడింది. రేవంత్కు కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ పదవి ఇవ్వడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీపీసీసీ పోస్ట్ రేవంత్కు ఇవ్వడంపై అసంతృప్తిని బయటపెట్టారు. కానీ, ఈ విషయంపై రేవంత్ మాత్రం ఇంకా స్పందించలేదు. మరోవైపు, గ్రూపు రాజకీయాలను సైతం రేవంత్ రెడ్డి మొదలుపెట్టారని అంటున్నారు.
Revanth Reddy: Revanth Reddy: కేసీఆర్ కంటే ముందు… కాంగ్రెస్ నేతల సంగతి చూస్తున్న రేవంత్
కొండా దంపతులు ఫీలయ్యారా?
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రేవంత్ ప్లాన్ ఏంటి.. వ్యూహాలు ఏంటన్నది కూడా ఉత్కంఠను రేపుతోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డిని నియమించాలని బలంగా కోరుకున్న కాంగ్రెస్ నేతల్లో కొండా దంపతులు ముందున్నారు. అయితే, రేవంత్ నియామకం తర్వాత వారి అభిప్రాయన్ని కూడా మీడియాతో పంచుకోలేదు. రేవంత్ను కలవలేదని సమాచారం. ఈ విషయం గ్రహించిన రేవంత్రెడ్డి తనకు వ్యతిరేక స్వరం వినిపించిన నేతలను, కినుక వహించిన వారిని నేరుగా కలుస్తూ పార్టీ బలోపేతానికి సహకరించాలని, కాంగ్రెస్ పునరేకీకరణకు కలిసి రావాలని పిలుపునిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కొండా దంపతుల ఇంటికి వెళ్లినట్లుగా సమాచారం.
Read More: KCR: కేసీఆర్ అవాక్కయ్యేలా చేస్తున్న కాంగ్రెస్
వారితో కలిసిన రేవంత్..
జూబ్లీహిల్స్లోని కొండా దంపతుల ఇంటికి చేరుకున్న పీసీసీ నూతన చీఫ్ రేవంత్రెడ్డికి మాజీ మంత్రి కొండా సురేఖ మంగళహారతితో స్వాగతం పలికారు. అనంతరం రేవంత్రెడ్డిని శాలువతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు వరంగల్లో ఉండగా… ఆయనతో రేవంత్రెడ్డి ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్ రాజకీయాల్లో మళ్లీ కేంద్ర బిందువుగా మారుతారనే అంచనాలు ఉన్నందునే రేవంత్ రెడ్డి వారిని కలిశారని అంటున్నారు.