RK Roja: నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై సినీ నటి, మంత్రి ఆర్కే రోజా సంచలన కామెంట్స్ చేశారు. బాలకృష్ణ గారు చాలా సరదాగా, యాక్టివ్ గా ఉంటారనీ, ఆయన ఏదైనా షో చేస్తే సక్సెస్ అవుతుందని తాను చాలా సార్లు మా వాళ్లకు చెప్పానన్నారు. ఎందుకంటే ఆయనను ఇంతకు ముందు ఓపెన్ గా చెంప పగలగొట్టడం, సెల్ ఫోన్ లు పగల గొట్టడమే చూశారన్నారు. ఆయన నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షోకు మంచి క్రేజ్ వస్తున్న సమయంలో ఆయన అనవసరంగా చంద్రబాబును తీసుకువచ్చాడేమో అని అనిపించిందని రోజా అన్నారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ కళ్యాణ్, లోకేష్ లు వచ్చిన తర్వాత మొత్తం సినారియో మారిపోయిందన్నారు.
ఎప్పుడో చనిపోయిన ఎన్టీఆర్ గారిని అడు చంద్రబాబు నాయుడు, ఇటు బాలకృష్ణ ఇప్పుడు ఫూల్ ను చేస్తున్నారని విమర్శించారు. సొంత తండ్రి ఎన్టీఆర్ ను ఆనాడు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే సహకరించిన బాలకృష్ణ ఈరోజు మళ్లీ సహకరించినట్లేకదా అని వ్యాఖ్యానించారు. ఆయనే (ఎన్టీఆర్) స్వయంగా చెప్పారు, ఈయన (చంద్రబాబు)ను అనవసరంగా నమ్మాను,. ఈ రోజు నన్ను వెన్నుపోటు పొడిచాడు, వీడంత సైకో, వీడంత రాక్షసుడు ఎవరూ లేరని నాడు ఎన్టీఆర్ చెప్పిన విషయాన్ని ఈ రోజు ఎన్టీఆర్ కరెక్టు కాదు, చంద్రబాబే కరెక్టు అని బాలకృష్ణ చెబుతున్నాడు అంటే నాన్న మీద ప్రేమ కంటే కూతురు కాపురం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుందని, అందుకే చంద్రబాబుకు భజన చేస్తున్నట్లు అనిపించిందని రోజా వ్యాఖ్యానించారు. అది చూసిన తర్వాత ఎన్టీఆర్ లాంటి మహానాయకుడిని అవమాన పర్చిన ఆ షోకు వెళ్లాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు రోజా తెలిపారు. గతంలో రెండు సార్లు పిలిచినప్పుడు వెళ్లడం కుదరలేదనీ.. ఇప్పుడు అన్ స్టాపబుల్ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని రోజా స్పష్టం చేశారు.
లోకేష్ పాదయాత్ర చేసినా, పవన్ కళ్యాణ్ వాారాహి ఇంటూ వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని రోజా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ భవానీ ద్వీపంలో సంక్రాంతి ముగింపు వెేడుకల్లో పాల్గొన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా.
BJP National Executive Meeting LIVE: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆ కీలక అంశంపై చర్చ జరగలేదు(ట)