Road Accident: కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కొత్తపేట మండలం మందపల్లి వద్ద ఈ తెల్లవారుజామున ద్విచక్ర వాహనాన్ని పాల వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ పై ప్రయాణం చేస్తున్న ముగ్గురు మృతి చెందారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వివరాల్లోకి వెళితే.. రావులపాలెం మండలం కొమర్రాజులంక కు చెందిన అప్పన నాగేశ్వరరావు భార్య, పిల్లలను పట్టించుకోకుండా కొత్తపేటలో మరో మహిళతో కలిసి ఉంటున్నాడు. నాగేశ్వరరావు ఇంటికి రాకపోవడంతో అతని తల్లి అప్పన్న సత్యవతి (55), భార్య వెంకట లక్ష్మి (40), కుమారుడు మహేష్ (20) లు ముగ్గురు ద్విచక్ర వాహనంపై శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కొత్తపేట వెళ్లి నాగేశ్వరరావుతో గొడవ పడ్డారు. అనంతరం అక్కడి నుండి ముగ్గురు దిచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామం వస్తుండగా మందపల్లి వద్ద పాల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కొమర్రాజులంకలో విషాదశ్చాయలు అలుముకున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?