Road accident : కృష్ణాజిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.. నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద 14 మంది వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని లారీ ఢీకొట్టింది.. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.. మిగతా తొమ్మిది మందిని ఆసుపత్రికి తరలించారు.. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న ఏపి డిప్యూటీ సీఎం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో కూలీలు మృతి చెందడం తనను ఎంతో బాధించిందని అన్నారు. పొట్ట చేత బట్టి బతుకుదెరువు కోసం వెళ్తున్న కూలీలు ఇలా మృత్యువాత పడడం అత్యంత బాధాకరమని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ.. ఈ ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. అవసరమైన వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఆళ్లనాని డీఎంహెచ్వో ను ఆదేశించారు.