Road accident: కాకినాడ జిల్లా తాళ్ళరేవు బైపాస్ రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలతో వెళ్తున్న ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు మహిళా కూలీలు మృతి చెందగా మరో అయిదుగురు గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
మృతులు రొయ్యల కంపెనీలో పనిచేసే కూలీలు గా గుర్తించారు. తాళ్ళరేవు నుండి యానం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం చూపరుల హృదయాలను కలచివేసింది.
Nandyala: బొల్తా కొట్టిన పర్యాటక శాఖ బోటు .. ఇద్దరు మృతి