NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Nellore: అర్ధరాత్రి రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడీ దొంగలు హాల్ చల్ .. ప్రయాణీకుల నుండి భారీగా బంగారం, నగదు దోపిడీ

Advertisements
Share

Nellore: నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడీ దొంగలు హాల్ చల్ చేశారు. ఈ ఘటనలు రైలు ప్రయాణీకులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తొంది. హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ను ఉలవపాడు పరిధిలో సుబ్బరాయుడు సత్రం గేటు వద్ద ఆరుగురు దుండగులు నిలిపివేశారు. అనంతరం దొంగలు ట్రైన్ లోని ఎస్ – 1, ఎస్ -2, ఎస్ – 3 బోగీల్లోకి ప్రవేశించి మహిళల వద్ద సుమారు 30 తులాల బంగారాన్ని, నగదును చోరీ చేశారు.

Advertisements

అనంతరం తెట్టు సమీపంలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ ను నిలిపి చోరీకి ప్రయత్నించారు. అయితే రైల్వే పోలీసులు అప్రమత్తమై వారిని ఎదుర్కొన్నారు. దీంతో దొంగలు వారిపై రాళ్లు రువ్వి పారిపోయారు. ఆ తర్వాత ట్రైన్ ముందుకు కదిలింది. రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో జరిగిన ఘటనలపై ప్రయాణీకులు తెట్టు, కావలి రైల్వే స్టేషన్ లలో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు ఒంగోలు రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

ISRO Chandrayan 3: స్వతంత్ర దినోత్సవంకి ఒక్కరోజు ముందు అద్భుత ఘట్టానికి చేరుకున్న చంద్రయాన్ 3…ఆగస్టు 14న చంద్రుడి కక్షలో కీలక మార్పు!


Share
Advertisements

Related posts

Relationship tips: ముద్దు ఎప్పుడు మధురాతి మధురం గా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!!!

Kumar

Vishnukrantha: ఈ మొక్క గురించి తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు..!!

bharani jella

Rajamouli – Mahesh babu : ఆఫ్రికా అడవుల్లో అతిపెద్ద యాక్షన్ డ్రామా రాజమౌళి _ మహేష్ బాబు సినిమా..

bharani jella