Roja: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోమారు తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. జలజగడం మరింత ముదిరి తెలుగు రాష్ట్రాల మధ్య అనూహ్య రీతిలో ముదిరిపోయి మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆనాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీటిని తరలించి నీటి దొంగ అయ్యాడని ఆరోపించిన ప్రశాంత్ రెడ్డి ఆయన కుమారుడై జగన్ మారాతాడని అనుకుంటే లంకలో ఉన్నవాళ్లంతా రాక్షసులే అన్నట్లు దొంగతనంగా ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్ట్, ఆర్డీఎస్ రైట్ కెనాల్ కట్టి ఏపీ సీఎం వైఎస్ జగన్ గజదొంగ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు.
Read More: KCR: గల్లీలో కొట్లాట… ఢిల్లీలో ఒకే మాట అంటున్న కేసీఆర్ , జగన్
రోజా వాదన ఇది…
మంత్రి హోదాలో ఉన్న ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రిని గజదొంగ అని విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని రోజా అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఏపీ సీఎం వైఎస్ జగన్పై మంత్రి ప్రశాంత్రెడ్డి వ్యాఖ్యలు సరైనది కాదని ఆమె పేర్కొన్నారు. కేటాయించిన నీటి వాటా కాకుండా అదనంగా చుక్క నీళ్లు కూడా ఏపీ ప్రభుత్వం వాడుకోవటం లేదనే విషయం తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రజల మనుసుల్లో విషం చిమ్మే ప్రయత్నం బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు చేయటం మంచిదికాదని రోజా హితవు పలికారు.
Read More: YS Jagan: రూటు మార్చుతున్న టీఆర్ఎస్ … జగన్ పై ఆ మంత్రి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు అప్పుడేం చేశారు?
సీతానగరం ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే రోజా అన్నారు. టీడీపీ నేతలు ఈ ఒక్క ఘటనతో విమర్శలకు దిగటం విడ్డూరం అని రోజా వ్యాఖ్యానించారు. రితికేష్వరి, వనజాక్షి ఘటనలపై అప్పుడు చంద్రబాబుతో పాటుగా టీడీపీ మహిళా నాయకులు ఏం చేశారు? అని రోజా ప్రశ్నించారు. ఎంతో మంది అమ్మాయిలపై టీడీపీ హయాంలో అత్యాచార ఘటనలు జరిగాయని పేర్కొన్న రోజా రాజకీయ ఒత్తిడిలతో ఒక్కరికి కూడా శిక్ష పడలేదని ఆరోపించారు.