RRR: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఏ సమస్యపైనా వెంటనే స్పందించేది ఎవరు అంటే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏ శాఖకు సంబంధించిన సమస్య అయినా ముందుగా ఆయన స్పందిస్తారు. ఆయన హామీ ఇస్తే ప్రభుత్వం హామీ ఇచ్చినట్లే, సమస్య పరిష్కారం అయిపోతుంది. గత కొన్నాళ్లుగా అనేక విషయాలపై ఆయా శాఖల మంత్రుల కంటే ముందుగానే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపైనా వెంటనే ఆయన స్పందిస్తున్నారు. తీవ్ర స్థాయిలో ప్రత్యారోపణలు చేస్తూ ఆరోపణలను ఖండిస్తున్నారు. రాజకీయ విమర్శలు, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ అధికారులతో చర్చలు, పార్టీ నేతలతో మంతనాలు, ప్రభుత్వ పాలనకు సంబంధించి వ్యవహారాలు ఇలా అన్ని విషయాల్లోనూ సజ్జల పనితీరు కనబడుతోంది.
RRR: జోడు పదవుల్లో బిజీగా సజ్జల
సజ్జలకు ఓ పక్క పార్టీ పరంగా ప్రధాన కార్యదర్శి హోదా ఉంది. ప్రభుత్వ పరంగా ప్రభుత్వ సలహాదారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ఈ కారణంగా అన్ని విషయాలను ఆయన చక్కబెడుతున్నారు. రాష్ట్ర అర్ధిక పరిస్థితి, బొగ్గు కొరత కారణంగా ఏర్పడుతున్న విద్యుత్ సమస్యలపై ఆయా శాఖల కంటే ముందుగానే సజ్జల మీడియా సమావేశాల్లో మాట్లాడారు. తాజాగా ఇటీవల ఉద్యోగుల సమస్యలపైనా ఆయా సంఘాల నేతలతో సీఎంఓలో సమావేశం నిర్వహించి వారికి పిఆర్సీ తదితర విషయాలపై హామీ ఇచ్చేశారు. పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల యాక్టివ్ రోల్ పోషిస్తుండటంతో ప్రతిపక్ష నాయకులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు.
RRR: రేపో మాపో సజ్జల మంత్రి
తాజాగా వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు సజ్జలపై సెటైర్ వేశారు. రాష్ట్రంలో ఏ సమస్య తలెత్తినా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే మాట్లాడుతున్నారన్నారు. ఆయన ఒక్కోసారి సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రేపో మాపో సజ్జల మంత్రి అవుతారనీ, అప్పుడు ఆయన ఒక మంత్రిత్వ శాఖను మాత్రమే చూస్తారా లేక సకల శాఖలను చూస్తారా అని ప్రశ్నించారు. మరో పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా విమర్శించారు రఘురామ కృష్ణంరాజు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రూ.2.87 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. ప్రభుత్వ ఖజానాలోని రూ.1.31 లక్షల కోట్లకు లెక్కలు కూడా తేలడం లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, అప్పులపై పూర్తి వివరాలను తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More: MAA: మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ కీలక లేఖ..! ముదురుతున్న వివాదం..!!