RTC Bus Service: తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. రేపటి నుండి ఏపికి బస్సులు నడుపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఏపిలో లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులను నడపాలని టీఎస్ ఆర్ టీసీ నిర్ణయించింది.
ఏపిలో రేపటి నుండి కర్ప్యూ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ కర్ప్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్దరించాలని ఏపిఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. కర్ప్యూ నిబంధనలకు అనుగుణంగా ఉదయం 6గంటల నుండి సాయంత్రం 6గంటల లోపు ప్రయాణీకులు గమ్యస్థానాలకు చేరుకునేలా ఏపి నుండి తెలంగాణకు, తెలంగాణ నుండి ఏపికి ఆర్ టిసి బస్సులు నడుపనున్నారు. ప్రయాణీకులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుని బస్సుల్లో ప్రయాణించవచ్చని ఆర్ టీసీ ప్రకటించింది.