YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై కొందర రాజకీయంగా దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో వివేకా హత్యలో భారీ కుట్రకోణం దాగి ఉందనీ, దాన్ని వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంటూ వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డి తదితరుల పేర్లు కూడా ప్రస్తావించింది. చార్జిషీటులోని అంశాలను పలు మీడియాల్లో రావడంతో సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
YS Viveka Murder Case: చార్జిషీటు పేరుతో తప్పుడు ఆరోపణలు
చార్జిషీటు పేరుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనీ, అప్పుడు కుట్ర చేశారనీ, ఇప్పుడు అంతకంటే ఎక్కువ కుట్ర చేస్తున్నారని సజ్జల అన్నారు. బాధితులనే నిందితులుగా చేసే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. సీబీఐ చార్జిషీటును కఛ్చితంగా ఛాలెంజ్ చేస్తామని అన్నారు. ఈ హత్య కేసులో వాస్తవాలు తెలియాలన్నారు. వివేకా హత్య కేసులోకు సంబంధించి సీబీఐ చార్జిషీటు హేతుబద్దంగా లేకుండ కథనంగా ఉందనీ, చార్జిషీటులో సంబంధం లేని వ్యక్తులపై కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి జెంటిల్మెన్ అని పేర్కొన్న సజ్జల, హత్య జరగకముందు అవినాష్ రెడ్డికి మద్దతుగా వైఎస్ వివేకానందరెడ్డి ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
వివేకా హత్య వెనుక టీడీపీ హస్తం..?
తనకు టికెట్ దక్కదన్న అక్కసుతోనే అవినాష్ రెడ్డి వైఎస్ వివేకాను హత్య చేశారని ప్రచారం చేయడం దారుణమని అన్నారు. ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య జగన్ ను బాగా కుంగదీసిందని అన్నారు. మార్చి 15న హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని సజ్జల గుర్తు చేశారు. చార్జి షీటు పేటుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రతిదాన్నీ రాజకీయం చేయడం టీడీపీకి అలవాటేనని విమర్శించారు. వివేకా హత్య వెనుక టీడీపీ హస్తం ఉండి ఉంటుందనీ, సీబీఐ చార్జిషీటు చూసిన తరువాత అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయని అన్నారు సజ్జల.