వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు రాజకీయ యాత్ర చేస్తున్నారంటూ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్మోహనరెడ్డి పాలనపై బురద చల్లడమే పని ఈనాడు పనిగా పెట్టుకుందని విమర్శించారు. చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి తాపత్రయం అంటూ సజ్జల మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేరుసుతున్నారని అన్నారు.
ఏపిలో జగన్మోహనరెడ్డి పరిపాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందన్నారు. మాజీ సీఎం చంద్రబాబు చరిత్రహీనుడుగా మిలిగిపోతారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సజ్జల. టీడీపీ హయాంలో ఖర్చు చేసిన లక్షా 10వేల కోట్లకు లెక్కలు లేవని టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏదో తప్పు జరిగిపోతుంది అన్నట్లు, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల ఘాటుగా విమర్శించారు.