Badvel By Poll: బద్వేలు ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 న నోటిఫికేషన్ విడుదల, అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైసీపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థిని ప్రకటించారు. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి సుధ తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు సజ్జల. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చిన అకాలమరణం చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అభ్యర్థి సుధను ప్రకటించిన సజ్జల.. బద్వేలు ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుంటామని అన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుండి టికెట్ ఇవ్వడం తమ పార్టీ సంప్రదాయమని చెప్పిన సజ్జల..సానుభూతిగా మిగిలిన పార్టీలు పోటీ ఉండకపోవడం సాంప్రదాయమన్నారు.
ఒక వేళ పోటీ పెట్టినా ఎంత సీరియస్ గా తీసుకోవాలో అలానే తీసుకుంటామన్నారు. నంద్యాల ఎన్నికకు ఈ ఎన్నికకు పోలిక లేదన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో అప్పటి సీఎం చంద్రబాబు ఒక పెద్ద జనరల్ ఎన్నికలుగా తీసుకున్నారనీ, వంద కోట్ల వరకూ పంపిణీ చేశారనీ, పథకాలు ఆగిపోతాయని భయపెడితే ఆ ఫలితాలు వచ్చాయని అన్నారు సజ్జల. ఈ ఎన్నికలు తమ ప్రభుత్వానికి గత రెండేళ్లలో చేసింది చెప్పుకోవడానికి ఇదొక అవకాశంగా భావిస్తున్నామన్నారు. ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం కూడా తమకూ అవసరమనీ, మెజార్టీ గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ రావచ్చని అభిప్రాయపడ్డారు సజ్జల.
కాగా తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా ఓబులాపురం రాజేశేఖర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపి – జనసేన అభ్యర్థులను పోటీకి నిలుపుతారా లేదా అనేది ఇష్టం చేయలేదు.
Read More:
1.Big Breaking: పంజాబ్ లో బిగ్ ట్విస్ట్..పీసీసీ అధ్యక్ష పదవికి సిద్దూ రాజీనామా..!!
3.YSRCP: తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేతలపై సీఎం జగన్ సీరియస్..?తాడేపల్లికి రావాలంటూ ఆదేశాలు..!!