Sajjala Ramakrishna Reddy: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ టూర్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తదితరులు విమర్శలు చేయడాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన జరిగిందని చెప్పారు. ఢిల్లీలో అయిదుగురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిశారని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పెండిండ్ అంశాలను వారి వద్ద ప్రస్తావించారని చెప్పారు. రాజకీయాలతో ఈ సమావేశాలకు సంబంధం లేదని అన్నారు.
గతంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చీకటి ఒప్పందాలు చేసుకునేవారనీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు జరిగాయని సజ్జల విమర్శించారు. జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ అనుకూల మీడియా తెగ హడావుడి చేసిందని అన్నారు. హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ వాయిదా పడితే వారి ఇష్టానురీతిలో అసత్యాలు, ఊహగానాలు ప్రసారం చేశాయన్నారు.
Read More: Crime News: పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చి కటకటాలపాలైన భర్త..! ఊరంతా షాక్..!!
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారనీ, కేంద్ర మంత్రుల వద్ద ఏయే విషయాలపై చర్చించి వినతి పత్రాలు ఇచ్చారనే దానిపై మీడియాకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంగా వాడుకున్నారని ఎన్నికలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే స్వయంగా విమర్శించిన విషయాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదన్నారు. ఇప్పుడు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం ఖాయమని పేర్కొన్నారు. సీఎం జగన్ ముందు చూపుతో తీసుకున్న ఆ నిర్ణయం అమలు అవుతుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు కేంద్ర సాయం కూడా ఉంటుందని అన్నారు. ఎంపి రఘురామ కృష్ణం రాజు పార్టీ లైన్ దాటి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనీ, అందుకే మరో సారి ఆయనపై చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిల్లాను కోరడం జరిగిందన్నారు.