Sanchaita Gajapati Raju: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా, సింహాచలం ఆలయాల ధర్మకర్తగా కొద్ది రోజుల పాటు ఓ వెలుగు వెలిగిన సంచయిత గజపతిరాజు ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా ఆమె కనిపించకుండా పోయారు. సంవత్సరం పాటు ఏపి రాజకీయాల్లో తన దైన ముద్ర వేసుకుని హాల్ చల్ చేసిన సంచయిత ఏపి రాజకీయాలు చూసి పక్కకు వెళ్లిరా, లేక సమయం కోసం వేచి చూస్తున్నారా అనేది తెలాల్సి ఉంది. రెండేళ్ల ముందు వరకూ సంచయిత గజపతిరాజు ఎవరు అనేది ఏపి రాజకీయాలకు పెద్దగా తెలియదు. ఢిల్లీ లో న్యాయవాదిగా పని చేస్తూ బీజేపీకి అనుబంధంగా ఉంటూ ఉండేవేరు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె పేరు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ తెరపైకి వచ్చింది.
Read More: YCP: ఈ ఒక్క స్ట్రాటజీతో టీడీపీకి సమాధి కడుతున్న సజ్జల..!?
Sanchaita Gajapati Raju: హైకోర్టు తీర్పుతో పదవికి ఎసరు
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజును దెబ్బతీసేందుకు వైసీపీ..ఆయన అన్న కుమార్తె అయిన సంచయితను తెరపైకి తీసుకువచ్చింది. అర్ధరాత్రి జీవోలతో మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా, సింహాచలం టెంపుల్స్ చైర్ పర్సన్ గా ఆమె బాధ్యతలు చేపట్టారు. పలు వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లోకి ఎక్కారు. చిన్నాన్న అశోక్ గజపతిరాజు పై సవాళ్లు విసిరారు. సంచయిత నియామంపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. దీంతో సంచయిత పదవి ఊడిపోయింది. తిరిగి చిన్నాన్న అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ కుర్చీలో కూర్చున్నారు. ఈ పరిణామం తరువాత సంచయిత న్యాయపోరాటం చేస్తున్నారు కానీ ఆమె పోరాటం ప్రస్తుతం ఫలించే పరిస్థితులు కనబడటం లేదు.
ఇక రాజకీయంగా..?
దీంతో తన పదవి ఊడగొట్టిన చిన్నాన్న అశోక్ గజపతిరాజును ఇక రాజకీయంగా ఎదుర్కోవాలని సిద్ధం అవుతున్నారుట. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజును ఎదుర్కొనేందుకు సంచయిత అవసరం వైసీపీకి కూడా ఉంది. ఈ నేపథ్యంలో తాను బీజేపీలో ఉంటే లాభం లేదని భావిస్తున్న సంచయిత రాబోయే ఎన్నికల నాటికి వైసీపీ తీర్ధం పుచ్చుకుని చిన్నాన్నపై ప్రత్యక్ష రాజకీయ పోరుకు దిగుతారన్న వార్తలు వినబడుతున్నాయి. చూడాలి ఏమి జరుగుతుందో..?