రాజధాని అమరావతి పై ఏపి ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై సుప్రీం కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల (జనవరి) 31వ తేదీలోపు అఫిడవిట్ లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ కేసులో ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు, మంత్రులు, పలువురు అధికారులు మొత్తం 161 మందికి ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అయితే అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి కాలపరిమితిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాత్రమే గతంలో సుప్రీం ధర్మాసనం స్టే ఇచ్చింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాత్రం స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
టీడీపీ ఎంపీ కేశినేని నానితో భేటీపై స్పందించిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు.. ఇదీ వివరణ