రాష్ట్రంలో (పీఆర్) స్థానిక ఎన్నికల పంచాయతీ అధికారులకు సంకటంగా మారింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఎస్ఎస్సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేగవంతం చేశారు. ఎన్నికల నిర్వహించి తీరాలన్న పట్టుదల తో ఎస్ఎస్సి ఉండగా ఎట్టి పరిస్థితులను ఎన్నికలు జరపకూడదు అన్న కృతనిశ్చయంతో ప్రభుత్వ ఉంది. సుప్రీంకోర్టు ద్వారా అయినా ఎన్నికలు నిరోధించాలని ప్రభుత్వం చూస్తున్నది. అయితే ఈ పరిణామాలు అధికార యంత్రాంగానికి ఇబ్బందికరంగా మారుతుంది. ముందు గొయ్యి, వెనక నుయ్యి అన్న సామెతగా అధికారుల పరిస్థితి ఉంది.
రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల సంఘం ఆదేశాలు ఖాతరు చేయకపోతే ఒక సమస్య, ఎస్ ఈ సి ఆదేశాల పాటిస్తే ప్రభుత్వం తో ఇబ్బంది. దీంతో ఎటు తెలుసుకొని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. ఈ కారణంతో ఎస్ ఈ సి ఈ సమావేశానికి హాజరుకావాలని పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశించిన వారు హాజరు కాలేదు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్యాహ్నం మూడు గంటలకు పీ ఆర్ అధికారులకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ సమయానికి వారు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల లోగా సమావేశానికి హాజరుకావాలని మెమో జారీ చేశారు. ఇదే చివరి అవకాశంగా ఎస్ ఈ సి మెమో లో స్పష్టం చేసింది. మరోపక్క ఉద్యోగ సంఘాలు స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాయి. దీంతో ఎన్నికలు జరుగుతాయా? జరగవా? అన్న సందిగ్దత నెలకొంది.